Festival · Telugu

కూవగం లో గంగ

Completed | Part 1 of 1 | 0 Likes

కూవగం లో గంగ
అప్పటికి రెండు రోజుల ముందు రామనాయకి, మార్టిన్ లతో డర్టీ పిక్చర్ కు వెళ్ళిన గంగ ఆ సినిమా చూసి చాలా డిస్టర్బ్ అయింది. ఆ తరువాత రాత్రి మార్టిన్ ఆమె తో పాటు అలా పడుకోవటం కూడా అది యాదృచ్ఛికం కాదు. తన పరిశోధనలో భాగం గానే ఆమె అలా చేసింది. గంగ స్థిరమైన మనస్సును చూసి చాలా చంచలించింది మార్టిన్. తరువాత మంగళవారం వాళ్ళు ముగ్గురూ మధ్యాహ్నం పైన కూవగం కు వెళ్ళి అక్కడి నుంచి ఉత్సవంలో పాల్గొని మరునాడు రావాలి పాండి కి వచ్చి అక్కడి నుంచి చెన్నై కి రావాలని రామ నాయకి ప్లాన్. అందుకు మిగిలిన ఇద్దరూ కూడా ఒప్పుకున్నారు. వాళ్ళు ముగ్గురు ఒక కార్లో కూవగానికి బయల్దేరారు. ఫ్రంట్ సీటులో డ్రైవర్ ప్రక్క రామ నాయకి కూర్చొంది. వెనుక సీట్లో మార్టిన్, గంగ కూర్చొన్నారు. దారిలో విలేజ్ దాటేలోపే కామిని కూడా ఎక్కింది. ఒక వైపు మార్టిన్, మరో వైపు కామిని మధ్య లో గంగ. పాండిచ్చేరి నుంచి కూవగం కు 67 కిలోమీటర్లు దూరం. దారి కొంత వరకు గతుకుల దారి కావటం చేత కారులో కుదుపులు ఎక్కువగా ఉన్నాయి. గంగ, పరికిణి, జాకెట్లో ఉంది. కూవగం వెళ్ళాక మంచి చీర కట్టుకోవాలని అక్క నాయిక తెచ్చిన చింత పిక్క రంగు చీరను సిద్ధం చేసుకుంది. దానికి మాచింగ్ లంగా, బ్రా, బ్లౌస్ అన్నీ వెంట తెచ్చుకుంది. ఈ లోపు దారిలో కామిని కుదుపు కుదుపు కీ దగ్గర అవుతోంది. నాయకి కామిని తో వెడతావా? అంటే వద్దంది కానీ ఎందుకో కామిని స్పర్శతో తన మృదువైన ఆవయవాలలో ఏదో తెలియని తియ్యదనం మనసును బాధ పెడుతోంది. కామినికి తనను లొంగి పొమ్మంటోంది మనస్సు. ఇంతలో మార్టిన్ కు కూడా తన మీద పడుతున్న గంగను చూడగానే ఏదో ఉత్సాహం పుడుతోంది. ఇల్లా దారి పొడవునా వాళ్ళిద్దరి మధ్య గంగ శాండ్ విచ్ తీరు అయిపోయింది. నాయకి ఇదంతా చూస్తూనే ఉంది. కానీ మౌనంగా ఉంది. వాళ్ళు కూవగం చేరేసరికి సాయంత్రం 6.00 గంటలు అయ్యింది. నాయకి వాళ్ళు నలుగురు ఉండటానికి ఆ గ్రామం లో ఒక ఇల్లు తీసుకుంది. ముందు గా నలుగురు అక్కడికి వెళ్ళాకా ఫ్రెష్ అప్ అయ్యారు. ఇక కామిని గంగను సిద్ధం చేస్తానంది. మార్టిన్ తాను కూడా హెల్ప్ చేస్తానంది. నాయకి గంగను వాళ్ళకి వదిలేసింది. తాను ఫోన్ తీసుకుని ఎవరితోనూ మాట్లాడుతూ కూర్చొంది. తరువాత ఒక గంటలో గంగను ఇద్దరూ కలిసి చాలా అందంగా అలంకరించారు. ఈ లోగా వాళ్ళిద్దరూ గంగ గుట్టు చూసేశారు. గుడి లో తంతు ముగిశాక రాత్రి ఏం చేయాలో గంగ తో ఒప్పందం కుదుర్చు కొన్నారు. ముందు వద్దన్నా గంగ ఆ రాత్రి వాళ్ళతో గడపటానికి సిద్ధం అయ్యింది. వాళ్ళు నలుగురు పార్థసారథి స్వామి ఆలయానికి చేరుకున్నారు. నిండుగా చీర కట్టుకుని, తలనిండా పూలు పెట్టుకుని, ముస్తాబైన గంగ ఒక దేవకన్య లాగా ఉంది. ఆ ఆలయ పూజారి మిగిలిన వాళ్లందరికీ కట్టినట్టే ఆమెకు కూడా తాళి కట్టాడు. ఆతరువాత అక్కడ చేయ వలసిన పూజలు చేశారు. అక్కడ అందరితో చాలా సేపు డాన్స్లు చేశారు. ఫోటో సెషన్స్ లో పాల్గొన్నారు. అటు ఇటు తిరిగారు. అక్కడ జరిగిన సంతలో వాళ్ళకి నచ్చిన సౌందర్య సామగ్రి కొనుకున్నారు. నలుగురు కలిసి రాత్రికి అక్కడే ఎవరో దాతలు ఏర్పాటు చేసిన విందు ఆరగించారు. ఆ తరువాత మార్టిన్, కామిని నాయకిని పక్కకు పిలిచి ఆమెకు ఏదో ఇచ్చి తరువాత ఆమెను ఎక్కడికొ పంపారు. ఆమె గంగతో ఆ రోజు రాత్రి తాను ఎక్కడికో పనిమీద వేడుతున్నానని చెప్పి మరునాడు పొద్దున్నే కలుద్దాం అనిచెప్పి వెళ్ళి పోయింది. ఆ తరువాత కామిని, మార్టిన్ గంగ కు లెస్బియన్ సంభోగ సుఖాన్ని రుచి మప్పారు. మధ్యలో వాళ్ళిద్దరూ రూల్స్ మార్చుకున్నారు. ఆ రాత్రి గంగకు కొత్తగా ఇద్దరు ఆడ మొగుళ్లు లభించారు. వాళ్ళిద్దరికీ ఆమె వల్ల మంచి సుఖం దొరికింది. ఆ తరువాత ఆమె వాళ్ళిద్దరినీ తనకి ఆ రెండు రోజులకి మొగుళ్లు గా నే చూసుకుంది. వాళ్ళకి కూడా ఆమె పట్ల ఎంతో ప్రేమ పెరిగింది. ఇంక చివరి ఘట్టం లోకి అడుగుపెట్టారు. అది బుధవారం. పొద్దున్నే నాయకి వచ్చేసింది. అందరూ స్నానాలు చేసి సిద్ధం అయ్యారు. నాయకి, గంగ ముందు రోజు తాళి కట్టించుకున్నారు కాబట్టి తమకు భర్త అయిన పురాణ పురుషుడు అరవాన్ కురు పాండవ యుద్ధం లో మరణించాడు కనుక డానికి గుర్తు గా అని తెల్ల చీరలు కట్టుకున్నారు. వాళ్ళలాగా ఎందరో హిజ్రా మహిళలు (అరవాణులు) కూడా తెల్ల చీరలు కట్టుకుని అక్కడ ఉన్న చెరువు గట్టు దగ్గరకు అప్పటికే చేరుకున్నారు. ఇంచు మించుగా ఉదయం 11 గంటలు. చెరువు గట్టు కు వెళ్ళే ముందు నాయకి, గంగ, వాళ్ళతో పాటు కామిని, మార్టిన్ శ్రీ పార్థసారథి గుడి కి వెళ్ళి లోపల దర్శనం చేసుకుని పూజలు చేసి వచ్చేశారు. ఇంతలో గంగ చెప్పులు ఎవరో వేసుకుని వెళ్లిపోయారు. అప్పటికే ఎండ తాపం ఎక్కువ అయ్యింది . అందరూ మూడు కిలోమీటర్లు నడవాలి. గంగకు చాలా కష్టం అయ్యిపోయింది. కాళ్ళు ఎండకు కాలి బొబ్బలు ఎక్కుతున్నాయి. అతి కష్టం మీద అందరూ ఆ చెరువు దగ్గరకు చేరుకున్నారు. అందరితో పాటు వీళ్ళిద్దరూ కూడా తమ చేతులకు నిండుగా వేసుకున్న గాజులను పగులకొట్టుకున్నారు. తమ బొట్టు చెరిపేసుకున్నారు. తమ తలలో పూలు తీసేశారు. మోకాళ్లు జాపుకుని కూర్చుని బిగ్గరగా ఆ పురాణ పురుషుడైన అరవాణుడు మరణించాడు. తమకు వైధవ్యం ప్రాప్తించింది అని ఏడవటం మొదలు పెట్టారు. అలా చాలా సేపు గుండెలు బాదుకుంటూ ఏడిచి అక్కడి నుంచి బయల్దేరి విల్లుపురం లో హోటల్ లో లంచ్ చేసి నలుగురు కలిసి పాండిచ్చేరి కి చేరుకున్నారు. ఇలా గంగ కూవగం ప్రయాణం ఆమె జీవితం లో మరో మలుపు తిప్పింది.
00000000

Congratulations!

You've successfully completed reading all published parts of this story!

842 Views 0 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (0)

No comments shared yet. Be the first to share your thoughts!
Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login