6
ఇదంతా చూసి అంతఃపురం లో సేవకులు, స్త్రీలు తన వస్త్రాలను కూడా లాగి వేయటం వల్ల అర్థ ఊరుకం మాత్రమే మిగిలిన కురంగి పద్మాసనంలో కూర్చొని ఏవో మంత్రాలు చదవటం మొదలు పెట్టాడు. అందరూ కురంగిని స్త్రీ అనే భావిస్తున్నారు. ఆమె ఇప్పుడు అర్థనగ్నం గా ఉంది అని అందరి భావన. కారణం కురంగి పొడవాటి జుట్టు, బాగా పెద్దవి గా ఉన్న గుబ్బలు. సన్నని నడుము. నున్నని తొడలు. మీనఖండాల లాంటి జంఘాలు. ఎత్తైన మడమలు. చాలా అందమైన పాదాలు. ఒక్క స్త్రీత్వం ఉండవలసిన ప్రదేశాన్ని అతిచిన్న ఆర్థోరుకం కప్పి ఉంచింది. అప్పుడు కురంగి ధ్యానాన్ని భంగపరచి లోబరచుకోవటం కోసం కాపాలికుడు, సింగముడు ముందుకు ఉరికారు. ఒకడు వెనుక నుంచి కురంగిని వశపరచుకోవాలి అనుకున్నాడు. కాపాలికుడు కురంగి స్తన ద్వయాన్ని పట్టుకోవాలి అనుకున్నాడు. అప్పుడు నియుద్ధలో ఆరితేరిన కురంగి వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వకుండా వాళ్ళను మోకాళ్ళతో కాపాలికుని, వెనుకకు మోచేతులతో సింగముని తెరపి లేకుండా బాది బాది తనను తాను రక్షించుకుని ప్రత్యంగిరా మంత్ర జపం చేశాడు. ఆ మంత్ర జపం వల్ల నందిని చుట్టూ ఒక రక్షా వలయం ఏర్పడింది. ఆమెను అదృశ్యంగా ఆక్రమించిన ఘోరతామసుడు గగ్గోలు పెడుతూ తన నిజ రూపంతో బయటకు వచ్చాడు. అక్కడ నుంచి పరుగు తీయటం మొదలు పెట్టాడు. వెంటనే నందిని లేచి తన వస్త్రాలను కట్టుకుని నిండుగా కప్పుకుని వెంటనే తన జర్జరీ ప్రయోగం చేసి గురువుతో పాటు పరుగు పెట్టాలనుకున్న కాపాలికుని కుడి కాలి పై గట్టిగా దెబ్బ కొట్టింది. దానితో కాపాలికునికి కుడికాలు విరిగిపోయింది. అయినా ప్రాణాలపై తీపి తో అక్కడ నుంచి పారిపోయాడు. ఇంతలో మోహనుని కట్లు విప్పాడు కురంగి. వెంటనే మోహనుడు తన ఖడ్గాన్ని తీసుకుని సింగముని యొక్క శిరస్సును ఖండించాడు. అలా చంద్రగిరి పరగణా మోహనుని వశంఅయ్యింది. అప్పుడు ఆ అంతఃపురంలో బందీలు గా ఉన్న స్త్రీలను విడిచి పెట్టి వారికి స్వేచ్ఛను ఇమ్మని నందిని చెప్పింది. మోహనుడు తన తండ్రికి వార్త పంపి చంద్రగిరి పరగణా మన వశం అయ్యింది తండ్రీ అని చెప్పాడు.
అక్కడి నుంచి వాళ్ళు ఇక పై ముందు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అంచనా వేసుకున్నారు. భద్రతా బలగాలను పెంచారు. మారునాటి నుంచి తాము వెళ్లబోయే ఊళ్ళ జాబితా సిద్ధ పరిచారు. ఆ రాత్రి మోహనుడు, కురంగి ఏకాంతంలో గడిపారు.
కాని ఆ పగటి వేళ జరిగిన అఘాయిత్యం వల్ల నందినిలో ఏదో మార్పు వచ్చింది. ఆమెను వశపరచుకునే ప్రయత్నం లో ఘోరతామసుడు కామ ప్రియ అనే యక్షిణిని ఆ మధ్యాహ్న సందర్భంలో ప్రయోగించాడు. దాని వల్ల నందినిలోని యోగ శక్తులన్నీ పని చేయడం మానేశాయి. ఆమె కేవలం ఒక స్త్రీ లాగే ఆలోచిస్తున్నది. ఆమె బుద్ధి మాత్రం ధర్మం వైపు మొగ్గుచూపుతున్నప్పటికి ఆమెలో స్త్రీ స్వభావం మాత్రం ధర్మ నిరతిని కూడా అతిక్రమించేలాగా ఉంది. రాత్రి చీకటి పడిన దగ్గర నుంచి తనకంటూ ఆ అంతఃపురంలో ఇచ్చిన ఏకాంతమందిరం లో హంసతూలికా తల్పం పైన ఉండగా ఆమెలో కామ వికారాలు బాగా విజృంభిస్తున్నాయి. కామ వాంఛతో ఆమె శరీరం రగిలిపోతోంది. ఆమె పయోధరాల పరిమాణం ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసలకు అనుగుణంగా పెద్దదవుతున్నది. ఎద నిప్పుల కొలిమిలా ఉంది. ఆమె నితాంతం కామ పీడిత అవుతున్నది.. స్థిరంగా ఒక భంగిమలో నిదుర రావటం లేదు. అటు ఒత్తిగిలి, ఇటు వత్తిగిలి తల్పం పై అటు ఇటు దొరలుతోంది. నితంబద్వయం ఆమెను కుదురుగా ఉండనివ్వటం లేదు. అతి తీవ్రంగా ఆమె పురుష సాంగత్యాన్ని కోరుకుంటోంది. ఆమెలోపల ఎక్కడో ఉన్న నందయోగి స్పృహ ఇది అనుచితం. అనుచితం.. అని చెబుతున్నా ఆమె లెక్క పెట్టడం లేదు. ఆమెకు ఒకటే యావ. సంభోగేచ్ఛ. ఎవరైనా కావాలి. సంభోగించాలి. ఆమె విరహవేదనను తట్టుకోలేక పోతోంది. ఇదంతా ఆమెలో ఉన్న కామప్రియ యక్షిణీ ప్రభావం. 64 మంది యక్షిణీ విద్యలలో ఇది ఒకటి. ఆమె స్థితిని సఖుల ద్వారా తెలుసుకున్న కురంగి ఆమెకు కామోపచారాలకోసం కొంతమంది పరిచారికులను పంపాడు. వారితో పాటు తాను కూడా కొన్ని ఔషధాలను కూడా తీసుకుని వెళ్ళాడు. ముందుగా పరిచారికలు ఆమెను అతి పొడవైన తామరాకుల పడకపైకి మార్చారు. శరీరమంతా చందనపు గంధాన్ని వ్రాస్తున్నారు. ముఖ్యంగా ఆమె చన్నుల మీద, మదన గృహం మీద ఎక్కువ గంధాన్ని పులుముతున్నారు. శరీరం మీదన ఉన్న గంధమేకాదు, ఆమె చెన్నులపై, ఆమె మన్మథ గృహం పై పులిమిన గంధం కూడా నిమిషాలలో ఆరిపోతూ ఉంది. పైగా ఆకాశంలో పున్నమి చంద్రుడు తన కిరణాలను విజృంభించి ప్రసరింపచేసి కామవిప్లవాన్ని సృష్టి చేస్తున్నాడు. ఆమెకు పురుషసంపర్కం లేక పోతే తట్టుకోలేనంతలాగా ఉంది.
అప్పడు కురంగి సిద్ధేంద్ర యోగిని భక్తితో తలచుకుంది. వెంటనే సిద్ధేంద్రుడు అక్కడ ప్రత్యక్షమై “నేను అంతా చూస్తూనే ఉన్నాను కురంగి. ఇప్పుడు నందినిలో నీ గురువు అణచివేయబడ్డాడు. నీ జనని కూడా లేదు, కేవలం ఒక కాముకురాలు మాత్రమే ఉంది. ఆమె కామ వికారం ఉపశమింప చేయాలంటే ఒక పురుష సమాగమం అవసరం.
నేను నందినితో మాట్లాడుతాను.” అని నందిని శిరస్సుపై తన బ్రొటన వేలి కోనభాగాన్ని ఉంచి తిప్పుతూ ఆమెలోకి యోగ విద్యుత్తును పంపాడు. ఒక్కసారిగా ఆమె శరీరంలో ఒక విద్యుత్ ప్రవాహం సాగుతున్నది. “ఆమె యోగివర్య, మీరు చెప్పబోయేది నాకు తెలుసు. ఇప్పుడు మాట్లాడుతున్నదిని నందినికాదు. ఆమెలో ఉన్న కామప్రియ అనే యక్షిణిని. నాకు ఇప్పుడు పరుష సమాగమం కావాలి.” అని చెప్పింది. సిద్ధేంద్రుడు తల పంకించాడు. “స్త్రీగా మారడం అనేది ఎంత ప్రమాదకరమైనది?” అని అనుకున్నాడు.
అప్పుడు నందినిలో ఉన్న నందయోగిని ఉద్దేశించి ఇలా చెప్పాడు. “నంద! నీకు ఒక పురుష సమాగమాన్ని కలుగజేస్తాను.. కాని నువ్వు వెనువెంటనే పూర్వరూపాన్ని పొందలేవు. నీవు నందినిగా అతనికి భార్యగా మారతావు. అతడితో నువ్వు ఇక శిశువు పుట్టే వరకు కాపురం చేయాలి. దాంపత్య జీవితం లోని సుఖాలను పూర్తిగా అందించిన తరువాత నువ్వు నందయోగివి అవుతావు. “అని ముగించాడు. (సశేషం)
Festival · Telugu
కూచిపూడి కురంగి .. .. (నాట్య మయూరి)
Completed
|
Part 6 of 7
|
0 Likes
Part 6
1542 Views
0 Comments
Disclaimer
CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.
Reading preferences
100%
Discussion (0)